Andhra PradeshHome Page Slider

ఏపీలో మొత్తం ఓటర్లు ఎంతమందంటే?

Share with

ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్ల వివరాలను ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 4 కోట్ల 14 లక్షల మంది ఓటర్లున్నారని ఆయన పేర్కొన్నారు. ఏపీలో మొత్తం సర్వీస్ ఓటర్లు 65,707 మంది ఉన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఓటర్ల సంఖ్య 1500 దాటితే ఆక్సిరరీ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు మీనా. ఏపీలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.