Breaking NewscrimeHome Page SliderNews Alert

ద‌ర్శ‌నాల దందా కేసులో స‌స్పెన్ష‌న్‌

విజ‌య‌వాడ‌లోని ప్ర‌ముఖ శైల‌క్షేత్ర‌మైన‌ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీక‌న‌క‌దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామి ఆల‌య‌ వీఐపీ దర్శనాల దందా కేసులో .. ఇద్దరు ఆలయ ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్య‌వ‌హారంలో ఇప్పటి వరకు ఆరుగురిపై వేటు ప‌డ‌గా , మరికొంత మందిపై చ‌ర్య‌లు తీసుకునే అవకాశం ఉన్న‌ట్లు తెలిసింది.దళారి ఫోన్ నుంచి భారీ ఎత్తున నగదు బదిలీ అయినట్లు విచార‌ణ అధికారులు గుర్తించారు. ఆలయ సిబ్బంది ప్రమేయంతోనే ఈ దందా జరిగినట్లు నిర్థారణ అయ్యింది.ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతుంది.