పోలీసుల ఎదుటే సూసైడ్ ఎటెంప్ట్
రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు వ్యక్తి ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది.గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం తమ అనుమతి లేకుండానే తమ భూముల నుండి రోడ్డు వేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన రైతు ఆత్మహత్యకు యత్నించాడు.తనతో తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్తో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోబోయాడు.అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై బాధితుణ్ణి రక్షించారు.రెప్పపాటులో ప్రాణాపాయం నుంచి పోలీసులు కాపాడారు. మహేశ్వరం మండలం రావిడాల గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.

