ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ ఆ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. ఎంసెట్ కౌన్సెలింగ్ ఉన్నందున ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలను మాత్రమే విడుదల చేశామని అధికారులు వెల్లడించారు. ఈ నెల ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షకు సుమారు 1.13 లక్షల మంది విద్యార్థులు హజరైనట్లు తెలిపారు.