కర్నాటకలో ప్రధాని మోదీ ప్రచారం, ఇవాళ 3 మెగా ర్యాలీలు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ కర్నాటకలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మూడు మెగా బహిరంగ సభలు ప్రసంగిస్తారు. భారీ రోడ్ షోలకు హాజరవుతారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి, మే 10న 224 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడవుతాయి. కర్నాటకలో ప్రధాని మోదీ తొమ్మిదో పర్యటన ఇది. కర్నాటకలోని బీదర్ విమానాశ్రయానికి చేరుకొని, హెలికాప్టర్లో బీదర్ జిల్లాలోని హుమ్నాబాద్కు చేరుకుంటారు. సభ అనంతరం విమానంలో విజయపురకు చేరుకుని మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే మరో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం ఆయన బెళగావి జిల్లాలోని కుడాచికి చేరుకుంటారు, అక్కడ మధ్యాహ్నం 2:45 గంటలకు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం బెంగళూరు నార్త్లో భారీ రోడ్ షో నిర్వహించేందుకు ప్రధాని మోదీ సాయంత్రం బెంగళూరుకు చేరుకుంటారు. ఈ రాత్రి బెంగళూరులో బస చేయనున్న ప్రధాని ఆదివారం ఉదయం రాజ్భవన్ నుంచి బయలుదేరి జిల్లా కేంద్రమైన కోలార్, రామనగర జిల్లాలోని చన్నపట్న, హాసన్ జిల్లా బేలూరులో బహిరంగ సభల్లో పాల్గొంటారు. ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లే ముందు మైసూరు రోడ్ షోలో పాల్గొంటారు.