Andhra PradeshNews

స్పీడ్ పెంచిన పవన్‌కళ్యాణ్

పవన్‌కళ్యాణ్ తాజాగా ఏపీ అధికారపక్షంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. ఆయన ఏపీలో రాజకీయం ముఖచిత్రం మారుతుందని కూడా పవన్ తెలిపారు. నోవాటెల్ హోటల్లో టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటి ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. అనంతరం ఆయన చిత్తూరు జిల్లాలోని రైతులతో సమావేశమయ్యారు. అక్కడ నుంచి పవన్‌కళ్యాణ్ మంగళగిరి చేరుకున్నారు.  పవన్‌ కళ్యాణ్ రాత్రి మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో బస చేశారు. ఈ రోజు ఉదయం పార్టీ నేతలతో పవన్‌కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్తు కార్యకలాపాలపై ఆయన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. సమావేశానంతరం పవన్‌కళ్యాణ్ హైదరాబాద్‌కు బయలుదేరారు. అయితే పవన్‌కళ్యాణ్ ఆలోచనలు,నిర్ణయాలు ఏపీ రాజకీయాలలో కీలక పరిణామాలకు దారీతీస్తున్నట్లు కన్పిస్తున్నాయి.

Read more: ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యం: రాహుల్ గాంధీ