Home Page SliderNationalNews Alert

మమతా బెనర్జీ మాటలకు చలించిన మోదీ..

తల్లిని కోల్పోయి విచారంలో ఉన్నప్పటికీ, ప్రధాని మోదీ… వర్చువల్‌గా కోల్‌కతా నుంచి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపారు. హౌరా నుంచి న్యూ జల్పాయిగురి మధ్య తిరిగే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌, సీఎం మమత బెనర్జీ, రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి వెస్ట్‌ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ధన్యవాదాలు తెలియజేస్తూ.. ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. బెంగాల్‌ ప్రజల తరుఫున ఈ అవకాశం ఇచ్చినందుకుకు ఎంతో ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబానికి ఏ విధంగా సానుభూతి వ్యక్తం చేయాలో నాకు తెలియడం లేదు. నేడు మీకు ఎంతో విషాదకరమైన రోజు. అయినప్పటికీ, ఈ కార్యక్రమానికి వర్చువల్‌గా హాజరు కావడం అదొక గౌరవం. మీరు మీ పని ద్వారా మీ అమ్మగారి పట్ల గౌరవాన్ని చాటుకుంటున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మీ అమ్మ మాకు కూడా అమ్మే. మీ సేవలు కొనసాగించేందుకు వీలుగా భగవంతుడు మీకు బలాన్నివ్వాలి. దయ చేసి కొంత విశ్రాంతి తీసుకోండి.  అని మమతా బెనర్జీ చెప్పారు.

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ప్రజలకు క్షమాపణలు తెలిపారు. తాను బెంగాల్‌కు రావాల్సిందని, కానీ వ్యక్తిగత కారణాల వల్ల రాలేకపోయాయని చెప్పారు. ఇందుకు బెంగాల్‌వాసులు తనను క్షమించాలని కోరారు.