వర్షాకాలం ఇవి దగ్గర పెట్టుకోండి..
ప్రస్తుతం వర్షాకాలం మొదలయ్యింది. వర్షాలతో ప్రజలు ఎక్కువగా జలుబు, దగ్గు సమస్యలతోనే బాధపడుతుంటారు. ఇవి రాగానే వెంటనే డాక్టర్ల దగ్గరకు వెళ్లి పదుల కొద్ది ట్యాబ్లెట్లు, సిరప్ లు తీసేసుకుంటారు. వాటిని వారం రోజులు వేసుకున్నా తగ్గదు. కానీ మన వంటింట్లోనే కొన్ని చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. జలుబు, దగ్గుకు శొంటి అద్భుతంగా పనిచేస్తుంది. శొంటిని వేడి నీళ్లలో లేదంటే పాలల్లో వేసి మరిగించాలి. బాగా మరిగిన తర్వాత వాటిని తాగాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తాగితే త్వరగా తగ్గుతుంది. పైగా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి ఈ శొంటితో. తులసి ఆకుల రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న చిట్కా. నాలుగు తమలపాకులను గోరువెచ్చగా చేయాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఈ రసంలో అంతే మొత్తంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. లేదంటే ఓ రెండు చెంచాల నూనెను కాచి, ఒక చెంచాలో కర్పూరాన్ని పొడిచేసి నూనెలో కలిపి ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి