Home Page SliderTelangana

సీఎం రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చింది..

సీఎం రేవంత్ రెడ్డికి పోయే కాలం వచ్చిందని మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ బీసీ కాదన్న రేవంత్ వ్యాఖ్యలపై ఈటల ఘాటుగా స్పందించారు. మోడీని తిడితే ఏమైతుందో కేసీఆర్ కు తెలిసిందని.. త్వరలోనే రేవంత్ కు తెలుస్తుందని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. భారత దేశంలో మోడీని విశ్వసించని, ప్రేమించని వారు లేరని, పేదరికం నుంచి వచ్చిన వాడిని, పేదల బాధలు అన్ని తెలుసు, అందులో పీహెచ్ డీ చేశానని మోడీ ఎన్నోసార్లు చెప్పారు అని ఈటల గుర్తు చేశారు. అప్పుడు కేసీఆర్ కు కళ్లు నెత్తికెక్కి మోడీ, గీడీ అని మాట్లాడారు, ఇప్పుడు రేవంత్ ఢిల్లీకి పోయి మోడీ గారిని పెద్దన్న అంటారు, కేంద్రం సాకారం కావాలని అడుగుతూనే.. తెలంగాణకు వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. మోడీ బీసీ కాదు అని మాట్లాడుతున్న రేవంత్.. ఆయన కులాలకు అతీతం, భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ పటం నిలబెడుతున్న వ్యక్తి అని కొనియాడారు. అమెరికన్ ప్రెసిడెంటే కుర్చీ వేసి కూర్చోబెడుతున్నారు అని ఈటల అన్నారు.