కదిలే రైల్లో ఐఆర్సీటీసీ ఉద్యోగి నిర్వాకం..మండిపడ్డ నెటిజన్లు
భారతీయ రైల్వేలో ఉద్యోగుల పనితీరు కంచే చేను మేసిన చందంగా ఉంది. క్యాటరింగ్, పరిశుభ్రత కోసం నియమించిన ఐఆర్సీటీసీ ఉద్యోగే రైల్లోని చెత్తను బాధ్యతారహితంగా కదులుతున్న రైల్లో నుండి బయటకు విసిరేశాడు. ఈ పనిపై అక్కడున్న ప్రయాణికులు వారించినా వినకుండా, ఆ డస్ట్బిన్లోని చెత్తనంతా విసిరేశాడు. పైగా మరి చెత్త ఎక్కడ వెయ్యాలి అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో అతడిపై, రైల్వేశాఖపై విమర్శలు చేస్తూ అసహనం వ్యక్తం చేశారు. దీనితో ఉన్నతాధికారులు స్పందించి, చెత్త తీసే యంత్రాంగం ఉందని, విధుల్లో ఉండి నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నారు.