Breaking NewsHome Page SliderInternationalTrending Today

పాక్ పౌరులకు భారత్ కీలక ఆదేశాలు..

భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు కేంద్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాకిస్తాన్ పౌరులు వీలైనంత తొందరలో దేశం విడిచి వెళ్లిపోవాలని, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే లోగా అటారీ- వాఘా బార్డర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో వెసులుబాటు కల్పిస్తున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరింది. ఇప్పటి వరకూ 926 మంది పాకిస్తాన్ పౌరులు భారత్ నుండి వెళ్లగా, పాకిస్తాన్ నుండి భారత్‌కు 1814 మంది వచ్చారు. ఇప్పటికే ఇరు దేశాలు గగనతలాన్ని మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ చర్య వల్ల దక్షిణ ఆసియా దేశాలకు వెళ్లే పాక్ విమానాలు శ్రీలంక మీదుగా చుట్టుతిరిగి ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీనివల్ల విమాన ప్రయాణ సమయం, ఛార్జీలు, ఇంధన ధరల పెంపు వంటి ప్రతికూల ప్రభావాలు ఉండబోతున్నాయి.