భారీ ఎన్కౌంటర్..12 మంది మృతి..
ఛత్తీస్గఢ్లో దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా చేసిన ఈ యాంటీ నక్సల్ ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్గఢ్లోని నారాయణ్పుర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగావ్ జిల్లాలలో కూంబింగ్ చేపట్టారు. అక్కడ నారాయణ్పూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది, మావోయిస్టుల మధ్య భీకర యుద్ధం జరిగింది. దళాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో మావోయిస్టుల కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

