Home Page SliderNationalNews Alert

యూట్యూబ్, ఓటీటీలకు ప్రభుత్వ హెచ్చరికలు

ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో రచ్చకెక్కిన యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కేసు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రసారమయ్యే అన్ని ఓటీటీలకు, యూట్యూబ్ ఛానెల్స్‌కు తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుండి ఈ మేరకు తాజా నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఐటీ రూల్స్‌ 2021లోని కోడ్ ఆప్ ఎథిక్స్‌ను ఓటీటీలు, సోషల్ మీడియాలు తప్పకుండా పాటించాలని హెచ్చరించింది. అలాగే చిన్నారులకు ఎ రేటెడ్ కంటెంట్ అందుబాటులో లేకుండా చూడాలని ఆదేశించింది. కుటుంబ వ్యవస్థలపై, సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపిల్లలపై అనుచిత, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు, వీడియోలు ప్రసారం చేస్తే తగిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించింది.