మేలుకో వినియోగదారుడా.. కొత్త రూల్స్ తెలుసుకోండి
వినియోగదారుల చైతన్యం కోసం మేలుకో వినియోగదారుడా అనే నినాదంతో కొత్త చట్టం అమలులోకి వచ్చింది. వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో వినియోగదారుల కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ వినియోగదారుల చట్టంలో ఈ కామర్స్ సంస్థలు కూడా చేరాయి. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి సంస్థలలో కూడా ఏదైనా వస్తువు కొనుగోలు చేసి, వస్తు సేవలలో లోపాలు ఉంటే ఈ కమిషన్లో ఫిర్యాదు చేయవచ్చు. రూ. 5 లక్షల వరకూ కోర్టు ఫీజులు కూడా చెల్లించనవసరం లేదు. చట్ట ప్రకారం కేసు నమోదైన 120 రోజులలో తీర్పు వెలువడుతుంది. ఫోన్లో కూడా ఫిర్యాదును స్వీకరిస్తారు. రూ. 50 లక్షల వరకూ, జిల్లా స్థాయిలో, రూ. 2 కోట్ల వరకూ రాష్ట్రకమీషన్లో ఫిర్యాదులు స్వీకరిస్తారు. అంతకు పైన విలువ గల కేసులను జాతీయస్థాయిలో ఫిర్యాదు చేయవచ్చు. ఆన్ లైన్లో కూడా http://edaakhi.nic.in/ అనే వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చు. వస్తువు కొనేటప్పుడు బిల్లు, రశీదులు, ఆన్లైన్ పేమెంట్ ఇన్వాయిస్లను, ఐడీలను భద్రపరుచుకోవాలి. వీటిని సాక్ష్యాలుగా స్వీకరిస్తారు.