Andhra PradeshHome Page Slider

బైక్ ప్రమాదంలో కాబోయే జంట మృతి

Share with

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెను విషాదం చోటుచేసుకుంది. మరో 15 రోజుల్లో పెళ్లి కావల్సిన జంట రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడింది. ఫోర్త్ బ్రిడ్జిపై  బైక్‌లో వెళుతున్న ఆజంటను వెనుకనుండి లారీ ఢీకొట్టింది. దీనితో శరీరాలు నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ఇద్దరూ మరణించారు. షాపింగ్ నిమిత్తం, గుడికి వెళ్లాలని కోరికతో వీరు బయటకి వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే శుభలేఖలు పంచారు కుటుంబీకులు. ఈ జంట అకాలమరణం చెందడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.