వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి
తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వర రెడ్డి. వెంకటేశ్వర రెడ్డితో పాటు ఆయన కుమారుడు నితిన్ రెడ్డి, సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున యర్రం వెంకటేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత పాల్గొన్నారు.
