ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ (25) అనే వ్యక్తి.. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని ప్రేమిస్తున్నానని నమ్మించి దారుణానికి ఒడిగట్టాడు.వసతి గృహంలో ఉంటున్న యువతిని ఫంక్షన్ ఉందని ఇంటికి ఆహ్వానించిన హుస్సేన్.. ఇంటికి వెళ్ళేసరికి హుస్సేన్ స్నేహితులు షేక్ గాలి సైదా (26), చింతల ప్రభుదాస్ (25) ఇంట్లో ఉన్నారు.ఫంక్షన్ జరగట్లేదని గ్రహించిన యువతి హుస్సేన్ ను నిలదీసింది. నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని పిలిచానని చెప్పి నమ్మించి, ఆ తర్వాత బయటకి వెళ్లి వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు.హుస్సేన్, ప్రభుదాస్ ఇంటి బయట కాపలా ఉండగా.. షేక్ గాలి సైదా గదిలోపలకి వచ్చి నువ్వు, హుస్సేన్ దిగిన వ్యక్తిగత ఫోటోలు ఉన్నాయని బెదిరించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లింది.పోలీసులకు జరిగినదంతా చెప్పింది. ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరిస్తూ తనపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.

