Home Page SliderTelangana

సెప్టెంబర్‌లో కాంగ్రెస్ మ్యానిఫెస్టో రిలీజ్ చేస్తాం: రేవంత్ రెడ్డి

Share with

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఈ గెలుపుకి ప్రధాన కారణం కాంగ్రెస్ మ్యానిఫెస్టోనే అని తెలుస్తోంది. తెలంగాణాలో మరో 4 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. దీంతో తెలంగాణాలోని అన్ని పార్టీలు మ్యానిఫెస్టోపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ TPCC ఛీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్  పార్టీలో పోరాడే వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. రాజకీయ భవిష్యత్తుకు యూత్ కాంగ్రెస్ ఒక మంచి వేదిక అని చెప్పారు. తెలంగాణా విమోచన దినోత్సవం రోజు అనగా సెప్టెంబర్ 17న పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని రేవంత్ యూత్ కాంగ్రెస్ జాతీయ సమావేశాల్లో వెల్లడించారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ అగ్రనేత సోనీయా గాంధీ పుట్టినరోజు కానుకగా కాంగ్రెస్ గెలుపును అందిద్దామని పార్టీ శ్రేణులకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.