Home Page SlidermoviesNationalNews AlertTrending Today

సినిమాగా రానున్న ముఖ్యమంత్రి అన్‌టోల్డ్ స్టోరీ..

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన ‘ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ చిత్రాన్ని బుధవారం ప్రకటించారు. అనంత్ జోషి నటించిన ఈ చిత్రం 2025లో ఐదు భాషల్లో విడుదల కానుంది. రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సామ్రాట్ సినిమాటిక్స్ నిర్మించింది.  ఈ చిత్రానికి రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహించారు. అజే: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రం శంతను గుప్తా రాసిన “ది మాంక్ హూ బికమ్ చీఫ్ మినిస్టర్” పుస్తకం ఆధారంగా రూపొందించబడింది. ప్రకటనతో పాటు మోషన్ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ చిత్రంలో యోగి జీవితంలోని ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయని సమాచారం.  ఒక సన్యాసి, ముఖ్యమంత్రిగా ఎలా మారారు అనే విషయంపై ఈ చిత్ర కథ ఉంటుంది.