బెంగాల్ వ్యాపారి ఇంట్లో నోట్ల కట్టలు
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన ‘ఇ-నగెట్స్’ అనే మోసపూరిత మొబైల్ గేమింగ్ యాప్ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ క్రమంలోనే వ్యాపారవేత్త అమీర్ ఖాన్ నివాసంతో పాటు 6 చోట్ల జరిపిన సోదాల్లో లెక్కల్లోకి రాని భారీ మొత్తంలో నగదు బయటపడింది. దీంతో అధికారులు లెక్కింపు మొదలుపెట్టగా.. ఇప్పటివరకు రూ.7 కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. పట్టుబడిన నగదు రూ. 15 కోట్లు దాటొచ్చని భావిస్తున్నారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

