Home Page SliderTelangana

కడుపు నొప్పితో ఆసుపత్రికి బాలుడు.. పొట్టలో 56 వస్తువులు

కడుపు నొప్పితో ఆసుపత్రికి వచ్చిన బాలుడిని పరీక్షించిన వైద్యులే షాక్ కు గురయ్యారు. స్కానింగ్ లో ఆ బాలుడి పొట్టలో పెద్ద సంఖ్యలో ఇనుప వస్తువులు కనిపించడమే దానికి కారణం. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులోని వస్తువులన్నీ బయటకు తీశారు. అయితే, వైద్యులు ఎంతగా కృషి చేసినా ఆ బాలుడి ప్రాణాలను మాత్రం నిలబెట్టలేకపోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హత్రాస్ కు చెందిన పదిహేనేండ్ల ఆదిత్య అనే బాలుడు కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో పాటు శ్వాస ఆడకపోవడంతో తల్లిదండ్రులు ఆదిత్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు స్కానింగ్ చేసి చూడగా అతని పొట్టలో ఇనుప వస్తువులు కనిపించాయి. వెంటనే ఆపరేషన్ చేసి కడుపులో నుంచి ఏకంగా 56 వస్తువులను వెలికి తీశారు. వాటిలో బ్యాటరీలు, బ్లేడ్, మొలలు, గోర్లతో పాటు చిన్న చిన్న ఇనుప వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఆదిత్య నోటితో మింగాడని వైద్యులు భావిస్తున్నారు. అయితే, ఆదిత్య గొంతుకు కానీ, ప్రేగులకు కానీ ఎలాంటి గాయం కాకపోవడంపై వారు వైద్యులకు ఆశ్యర్యానికి గురి చేస్తోంది. ఆదిత్యను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆదిత్య ప్రాణాలను కాపాడ లేకపోయామని వైద్యులు తెలిపారు.