crimeHome Page SliderNationalNews Alert

పట్టపగలే బ్యాంకు దోపిడీ

కర్ణాటకలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. నిన్ననే బీదర్‌లో ఏటీఎం వాహనంపై కాల్పులు జరిపి రూ.93 లక్షలు దోచుకుపోయిన ఘటన మరువకముందే కర్ణాటకలోనే దక్షిణ కన్నడ జిల్లాలో ఉల్లాల్ కేసీ రోడ్డులో ఒక బ్యాంకులో పట్టపగలే దోపిడీ జరిగింది. ఈ బ్యాంకులో తుపాకులతో ప్రవేశించిన దోపిడీ ముఠా ఉద్యోగులు, ఖాతాదారులను బెదిరించి, భారీ మొత్తంలో నగదు, బంగారం దోచుకుని పరారయ్యారు. వీరు ఫియట్ కారులో వచ్చిన ఐదుగురు ఈ దోపిడీకి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వారు తర్వాత మంగుళూరు వైపు పరారయ్యారని సమాచారం.