Home Page SliderInternational

సెర్బియాలో దారుణం.. విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది మృత్యువాత

Share with

సెర్బియాలోని ఓ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. కాగా అక్కడ ఓ విద్యార్థి చేసిన పని తోటి విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సెర్బియాలోని ఓ 14 ఏళ్ల విద్యార్థి తాను చదువుతున్న స్కూల్లో  విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఈ ఘటనలో 8 మంది విద్యార్థులతో సహ ఒక గార్డ్ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ దుర్ఘటన ఘటన సెంట్రల్ బెల్‌గ్రేడ్‌లోని వ్లాదిసావ్ రిబ్నికర్ పాఠశాలలో జరిగింది.   కాగా ఇవాళ తన తండ్రి తుపాకీని స్కూల్‌కు తీసుకువచ్చిన విద్యార్థి విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ దుర్ఘటనలో 6 గురు విద్యార్థులు ,ఒక టీచర్ కూడా గాయపడినట్లు సమాచారం. కాగా ఈ రోజు ఉదయం క్లాస్ జరుగతున్న సమయంలో ఈ విద్యార్థి ఒక్కసారిగా కాల్పులకు పాల్పడట్లు అధికారులు వెల్లడించారు.