తిరుపతి జిల్లాలో దారుణం..
తిరుపతి జిల్లాలోని గూడూరులో దారుణం జరిగింది. గూడూరులోని అశోక్నగర్లో మురికి కాలువలో కవల పసికందుల మృతదేహాలు లభ్యమయ్యాయి. పారిశుద్ధ్య కార్మికులు కాలువలో చెత్త తొలగిస్తుండగా.. ఈ శిశువుల మృతదేహాలను గుర్తించారు. దీనితో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.