Home Page SliderInternational

మయన్మార్‌లో మరోసారి భూకంపం

మయన్మార్‌లో మరోసారి భూకంపం కలకలం రేపింది. నిన్న రాత్రి 11.56 గంటలకు మయన్మార్‌లో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.2గా నమోదైందని పేర్కొంది. కాగా ఇప్పటివరకు ఈ భూకంపాలకు మయన్మార్‌లో 200 మందికి పైగా చనిపోయారు. అనధికార లెక్కల ప్రకారం ఆ సంఖ్య 1,000 వరకు ఉండొచ్చని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.