వీడు మామూలోడు కాదు.. గంట వ్యవధిలో ఆరు హత్యలు..
కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు హత్యలు చేశాడు ఓ యువకుడు. అదీ కూడా గంటల వ్యవధిలోనే హత్యలు చేశాడు. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ హత్యల తర్వాత అఫన్ పోలీసులకు లొంగిపోయాడు. అయితే.. అప్పటికే తను విషం తీసుకున్నట్లు అఫన్ పోలీసులకు చెప్పడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలు చూసిన పోలీసులు షాకయ్యారు. అసలు ఈ హత్యలు ఎందుకు చేశాడు అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.