ఒక్కరోజే 20 కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు
భారత్ విమానాలకు బాంబు బెదిరింపుల బెడద వీడటం లేదు. ఇవాళ ఒక్కరోజే 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులొచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎయిర్ ఇండియా, విస్తారా, ఆకాశా ఎయిర్, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలియన్స్ ఎయిర్ విమానాలకు బాంబు బెదిరింపులొచ్చినట్లు తెలిసింది.
విమానాలకు టార్గెట్ చేస్తూ.. బెదిరింపు కాల్స్, మెయిల్స్ చేస్తున్న వాళ్లను కఠినంగా శిక్షిస్తామని.. మిగతా వారిని సైతం వెంటనే గుర్తించి అరెస్ట్ చేస్తామని.. ఎవరూ ఎలాంటి భయాందోళనలు చెందొద్దు అని విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహననాయుడు ప్రకటించారు. అయినప్పటికీ బెదిరింపు కాల్స్ ఆగడం లేదు.
ఫేక్ కాల్స్ అని లైట్ తీసుకుంటే.. ఆ తర్వాత అది నిజం అయితే మా పరిస్థితి ఏంటీ? అని ఆయా విమాన సంస్థల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. విమాన సర్వీసుల భద్రతపై రాజీలేదని.. సెక్యూరిటీ కట్టుదిట్టం చేశామని.. విమానం బయలుదేరే ముందే అన్ని రకాలుగా చెకింగ్ చేస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహననాయుడు వెల్లడించారు.

