Andhra PradeshHome Page SliderNews Alert

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం

ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.  ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 13న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.