Home Page SliderInternational

తగ్గిపోతున్న జనాభా… భూమిపై జపాన్ మాయం కానుందా? ఆందోళనలో ప్రభుత్వం

సామాజిక భద్రతా వలయం, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసేలా పరిస్థితులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని… జపాన్ ఆందోళన చెందుతోంది. జపాన్‌లో ఏటా పుట్టే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంటే.. చనిపోయే వారి సంఖ్య అంతకంతకూ పెరుగోతంది. జనన రేటులో తగ్గుదల ఇలాగే కొనసాగితే… భవిష్యత్‌లో జపాన్ ఉనికిలో లేకుండా పోతుందని ఆ దేశ ప్రధాన మంత్రి ఫ్యూమియో కిషిడా సలహాదారు మోదీ అన్నారు. కొన్నాళ్లు జనాభా తగ్గుతూపోతే.. ప్రపంచ పటంలో జపాన్ కనుమరుగవుతుందని చెప్పారు. ఫిబ్రవరి 28న గత సంవత్సరం జన్మించిన శిశువుల సంఖ్య రికార్డు స్థాయికి పడిపోయిందని మసాకో మోరీ అన్నారు. గత సంవత్సరం, జపాన్‌లో జన్మించిన వారి కంటే రెండు రెట్లు ఎక్కువ మంది మరణించారన్నారు. 8 లక్షల కంటే తక్కువ జననాలు సంభవిస్తే… 15 లక్షల 80 వేల మంది మరణించారని పేర్కొన్నారు.

జపాన్ జనాభా 2008లో కేవలం 12 కోట్ల 80 లక్షల నుంచి 12 కోట్ల 46 లక్షలకు పడిపోయిందన్నారు. క్షీణత వేగం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల నిష్పత్తి గత సంవత్సరం 29% కంటే ఎక్కువ పెరిగిందన్నారు. దక్షిణ కొరియాలో తక్కువ సంతానోత్పత్తి రేటు ఉండగా, జపాన్ జనాభా వేగంగా తగ్గిపోతోందన్నారు. జనాభా తగ్గడం కాదని… క్రమంగా కిందకు వెళుతోందని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే… సామాజిక భద్రతా వ్యవస్థ కూలిపోతుందన్నారు. పారిశ్రామిక, ఆర్థిక బలం క్షీణిస్తుందని… దేశాన్ని రక్షించడానికి, స్వీయ-రక్షణ దళాలకు తగినంత మంది పౌరులు కూడా మిగలరని చెప్పారు. పిల్లలను కనే వయస్సులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం వల్ల సమస్య జఠిలమవుతోందన్నారు.