అమిత్ షా పర్యటన వివరాలు.. షెడ్యూల్ లో స్వల్ప మార్పులు
అమిత్ షా పర్యటనలో కొద్దిపాటి మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ను సవరించారు. వివరాలు ఇలా ఉన్నాయి..
* మధ్యాహ్నం 2 గం.లకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుండి బేగంపేట విమానాశ్రయానికి రాక
* సికింద్రాబాద్ ఉజ్జయినీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు
* మధ్యాహ్నం 2.40 గం.లకు సికింద్రాబాద్ బీజేపీ కార్యకర్త సత్యనారాయణ నివాసంలో టీ తాగుతారు
* మధ్యాహ్నం 3.15 గం.లకు హోటల్ రమదా మనోహర్ లో రైతు ప్రతినిధులతో సమావేశం
* సాయంత్రం 4.30 గం.లకు బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో మునుగోడుకు ప్రయాణం
* సాయంత్రం 4.55 గం.ల వరకు మునుగోడులో సీఆర్ పీఎఫ్ ఉన్నతాధికారులతో సమావేశం
* సాయంత్రం 5 గం.లకు మునుగోడులో సమర భేరి సభకు హాజరు
* సాయంత్రం 6.50 గం.లకు రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో ప్రత్యేక సమావేశం
* రాత్రి 7.20కి శంషాబాద్ నోవాటెల్ లో బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం.. డిన్నర్.
* రాత్రి 9 గం.లకు ఢిల్లీకి తిరుగు ప్రయాణం