తొక్కిసలాట మృతురాలి కుటుంబానికి రూ.25లక్షలు అందజేత
తిరుమల ఘటనలో మృతి చెందిన సేలం భక్తురాలు కుటుంబానికి టిటిడి రూ.25 లక్షల పరిహారాన్ని చెల్లించింది.వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం ఏర్పాటు చేసిన క్యూలో ఈ నెల 8న జరిగిన తోపులాటలో 6గురు మృతి చెందిన సంగతి తెలిసిందే.ఇందులో తమిళనాడు రాష్ట్రం మెట్టు సేలంకు చెందిన మల్లిక కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని టిటిడి బోర్డు సభ్యులు అందజేశారు. పరిహారం చెక్ ను మృతురాలు మల్లిక కుమారుడు రమేష్ కు టిటిడి బోర్డు సభ్యులు అందజేశారు.అదేవిధంగా టిటిడి పాలక మండలి తీర్మానం ప్రకారం పరిహారం చెల్లించగా, బాధితులకుటుంబంలో ఒకరికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చేందుకు వారి కుటుంబ సభ్యుల వివరాలను బోర్డు సభ్యుల బృందం తీసుకున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు టిటిడి బోర్డు సభ్యులతో మూడు బృందాలు ఏర్పాటు చేశారు, అందులో భాగంగా మృతురాలి కుటుంబ సభ్యులు ఉండే గ్రామానికి సదరు బోర్డు సభ్యులు వెళ్లి పరిహారం అందజేసి పరామర్శించారు.
