NewsTelangana

మంకీ పాక్స్‌పై పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ క్లారిటీ

Share with

ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయం, హైదరాబాద్‌

మిత్రులకు నమస్కారం, కామారెడ్డి జిల్లా ఇందిరానగర్‌‌ కాలనీకి చెందిన 40 ఏండ్ల ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలు ఉండడంతో, అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ హాస్పిటల్‌కు తరలిస్తున్నాం. ఈ వ్యక్తి జులై 6వ తేదీన కువైట్ నుంచి వచ్చారు. 20వ తేదీన అతనికి జ్వరం, 23వ తేదీ నాటికి రాషెస్‌ రావడంతో మరుసటి రోజు ఉదయం కామారెడ్డిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు వెళ్లాడు. అక్కడి డాక్టర్ మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించి కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్‌కు రిఫర్ చేశారు. అక్కడ్నుంచి 108లో అతన్ని ఫీవర్‌‌ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేస్తున్నాం. ఇక్కడ సాంపిల్ సేకరించి, పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపిస్తాం. అంతవరకు ఫీవర్‌‌ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్‌మెంట్ అందజేస్తాం. ఈ వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయిన ఆరుగురిని గుర్తించాం. వాళ్లెవరికీ సింప్టమ్స్‌ లేవు. అయినప్పటికీ వారిని ఐసోలేట్ చేశాం. గౌరవనీయులు మంత్రి హరీశ్‌రావు గారు పరిస్థితిని సమీక్షించి, ఎప్పటికప్పుడు మాకు సూచనలు చేస్తున్నారు. ఆయన సూచనల మేరకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం.

*ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ప్రాణాంతక వ్యాధి కాదు.*

–డాక్టర్ శ్రీనివాసరావు గడల, డైరెక్టర్, పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్