NationalNewsNews Alert

హెటిరో పార్థసారథి రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు

Share with

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు హెటిరో పార్థసారథి రెడ్డిపై పరిశ్రమల బాధిత సంఘం నాయకుడు నరేందర్ రెడ్డి… భారత ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. యాదాద్రి జిల్లాలోని అంతమ్మగూడెంలో ఉన్న పార్థసారథి రెడ్డి ఫార్మా కంపెనీ వల్ల 15 గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ విషయాలన్ని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు.

అలాగే గ్రామంలో ఇండస్ట్రీ ఉందని… ఈసీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు. పార్ధసారథి ఎన్నికల ఆఫిడవిట్‌లో అబద్దాలు చెప్పారని… తనపై క్రిమినల్ కేసు ఉందనే విషయం కూడా దాచి పెట్టారన్నారు. పార్ధసారథి రెడ్డి కంపెనీని వెంటనే మూసేయ్యాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కోర్టుకు వెళ్లడానికి కూడా తాము వెనుకాడబోమన్నారు. పార్థసారధిరెడ్డిపై ఈడీ , సీబీఐలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.