Andhra PradeshNews

వరద బాధిత ప్రాంతాల్లో చంద్రబాబు రాజకీయ యాత్ర

Share with

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఏపీ సీఎం జగన్‌ చేస్తున్న మంచి పనులకు వస్తున్న ప్రజాధారణను చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీలో పాలన కొనసాగుతోందన్నారు.

పార్లమెంట్‌‌లో టీడీపీ ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ టీడీపీ హయాంలో లక్షా 10 వేల కోట్లకు లెక్కలు లేవని స్పష్టం చేశారని వెల్లడించారు. మాజీ సీఎం చంద్రబాబు తప్పుడు విధానాలతో చరిత్రహీనులుగా మిగిలిపోయారని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏదో తప్పు జరిగిపోతోందన్న దుష్ప్రచారం చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు రాజకీయ యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను ఓదార్చడం పోయి రాజకీయ మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.