News Alert

హైదరాబాద్‌లో క్రికెట్ సందడి

Share with

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. చాలాకాలం తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ సందడి నెలకొనబోతోంది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా ఆటగాళ్లు భారత్‌తో టీ-20 మ్యాచ్‌లు ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌లకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. మన సొంతగడ్డపై ఇండియా మొదటిగా . ఆస్ట్రేలియాతో మూడు టీ-20లు ఆడుతుంది. తర్వాత సఫారీలతో 3వన్డే మ్యాచ్‌లు ఆడబోతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ నిర్ణయించింది. స్థానిక రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్ జరిపే అవకాశం లభించింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్‌ 25న ఉప్పల్‌లో జరుగబోతోంది. 2019 డిసెంబర్‌ 6న ఇక్కడ చివరి మ్యాచ్‌ (భారత్‌–ఆస్ట్రేలియా టి20) జరిగింది. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. సౌతాఫ్రికాతో సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 1, 3 న జరిగే 3 టి20మ్యాచ్‌లు త్రివేండ్రం, గువహటి, ఇండోర్‌లలో జరగబోతున్నాయి.  దక్షిణాఫ్రికాతో జరిగే 3 వన్డేలకు అక్టోబర్‌ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీలలో జరుగుతాయని బీసీసీఐ నిర్ణయించింది.