Andhra PradeshHome Page SliderPolitics

వైఎస్ జ‌గ‌న్‌…ఉమ‌న్స్ డే విషెస్‌

అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా మ‌హిళామ‌ణుల‌కు మాజీ సీఎం వైఎస్ జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు తెలిపారు.మ‌హిళలు బాగుంటేనే కుటుంబం బాగుంటుందని, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ దిశగా ఆలోచించే… వైఎస్సార్‌ ప్రభుత్వ కాలంలో మ‌హిళల అభ్యున్నతి, సాధికార‌తకు పెద్దపీట వేస్తూ పాల‌న చేశామ‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు. అన్నిరంగాల్లో మహిళలను ప్రోత్సహించి, దాదాపు 32కు పైగా ప‌థ‌కాల‌ ద్వారా వారికి భ‌రోసా క‌ల్పించామ‌ని చెప్పారు. నామినేటెడ్ ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం కేటాయిస్తూ తొలిసారిగా చ‌ట్టం చేశామ‌ని జ‌గ‌న్ చెప్పారు. గిరిజ‌న‌, ద‌ళిత మ‌హిళ‌ల‌ను డిప్యూటీ సీఎం, హోంమంత్రి లాంటి పెద్ద ప‌ద‌వుల‌తో గౌర‌వించామ‌ని చెప్పారు. మహిళల భద్రత, రక్షణ కోసం దిశ వ్య‌వ‌స్థ‌ను రూపొందిచామ‌ని వెల్ల‌డించారు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్న నానుడిని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకున్ఆరు. త‌న‌ భవిష్యత్ రాజకీయ ప్ర‌స్థానం కూడా మహిళాభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా సాగుతుందని జ‌గ‌న్ చెప్పారు.