మీరు ధనవంతులా…అయితే పిల్లలు జాగ్రత్త !
డ్రగ్స్కు బానిసైన ఓ మహిళ.. తనతోపాటు డ్రగ్స్కు అలవాటు పడిన ఓ అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడి.. పాఠశాల బాలికలే లక్ష్యంగా సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహిస్తున్న గుట్టును పోలీసులు రట్టు చేశారు. పాఠశాలకు వెళ్లివచ్చే సమయాల్లో ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరవుతుంది. చనువు పెంచుకుని, కలివిడిగా ఉన్నట్టు నటించి బాలికలను కిడ్నాప్ చేస్తోంది. ఆ బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి.. అప్పటికే తన, తన గ్యాంగ్ కు టచ్ లో ఉన్న మానవ మృగాలకు వారిని అప్పగిస్తూ ఉంటుంది.ఈ మహిళలకు డబ్బు ఇచ్చే మానవ మృగాలు.. బాలికలు మత్తులో ఉండగా వారిపై అత్యాచారాలు చేసేవారు. బాలికలు పూర్తిగా స్పృహలోకి రాగానే సదరు లేడీ గ్యాంగ్ వారిని ఎక్కడ నుంచి తీసుకొస్తుందో అక్కడే వదిలేసి వెళ్లిపోతారుఈ ముఠా దాదాపు ఏడాదిన్నరగా ఇలాంటి పనులు చేస్తూ పలువురు బాలికల జీవితాలను నాశనం చేసింది. కిడ్నాప్ చేసిన బాలికలను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలతో పాటు పక్కజిల్లాలకు కూడా తరలించినట్టు సమాచారంఅయితే వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం ఓ బాలిక కనిపించకుండా పోగా కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.

