News

ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం.. సర్కార్ నిర్ణయం..

ఢిల్లీలో వాయుకాలుష్యం తారస్థాయికి చేరుకోవడంతో అక్కడి ఆప్ సర్కార్ ఉద్యోగులకు కీలక సూచన చేసింది. ఆఫీసులకు రాకుండా ఇంటి నుంచే పని చేయాలని 50 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులను ఆదేశించింది. కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పర్యావరణ మంత్రి గోపాల్రాయ్ ఎక్స్ ద్వారా వెల్లడించారు. ఢిల్లీలో ఈ ఉదయం గాలి నాణ్యత సూచీ 422గా నమోదైంది. నగరంలో పెరుగుతున్న వాయు కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నిన్న ప్రభుత్వ కార్యాలయాల సమయాలను సవరించారు. ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ కింద పని చేసే కార్యాలయాలు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వం కింద పని చేసే కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పని చేసేలా సవరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.