Andhra PradeshHome Page SliderNews Alert

మెరుగైన పోలీసింగ్‌తో నేరాలను తగ్గించగలిగాం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ ఏడాది క్రైం రేటు తగ్గిందని రాజేంద్రనాథ్‌ రెడ్డి వెల్లడించారు. నేడు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మెరుగైనా పోలీసింగ్‌తో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. గతేడాది 2,84,753 కేసులు నమోదు కాగా, 2022లో 2,31,359 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు.  2021 లో 945 హత్య కేసులు నమోదు కాగా, 2022లో 857 హత్య కేసులు మాత్రమే నమోదయ్యాయి.  చోరీల్లో నేరస్తులను గుర్తించడం, మరియ రికవరీ శాతం బాగా పెరిగాయన్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు 2021 లో 19203 జరుగగా 2022 లో 18739 ప్రమాదాలు జరిగాయి. బ్లాక్ స్పాట్ లను గుర్తించి నివారణా చర్యలు చేపట్టాం. లోక్ అదాలత్ తో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారిస్తున్నామని డీజీపీ పేర్కొన్నారు.  

చిన్నపాటి వివాదాలు, మనస్పర్ధల కారణంగా వివాదాల్లో ఉన్న కేసులలో ఇరువర్గాలను పిలిపించి రాజీ కుదిర్చమన్నారు. లోక్ అదాలత్ ద్వారా 1,08,763 కేసులు పరిష్కారం చేశామని ఆయన వివరించారు. 66% కేసుల్లో కన్విన్షన్ చేయించగలిగాం. కన్విక్షన్ బేస్ పోలింగ్ విధానాన్ని ఈ సంవత్సరం జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రతి ఒక్క యూనిట్ అధికారి సిపి/ ఎస్పీ తమ పరిధిలోని అత్యంత ముఖ్యమైన ఐదు కేసులు(మహిళలకు సంభందించిన కేసులకు మొదటి ప్రాధాన్యత) పర్యవేక్షణ చేస్తారు. ప్రతిరోజు షెడ్యూల్ మేరకు కోర్టులో జరుగుతున్న కేసు ట్రైల్ పురోగతిపై సమీక్ష నిర్వహించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానం ద్వారా కేసు యొక్క ట్రైల్ సమయాన్ని తగ్గించి స్వల్పకాల వ్యవధిలోనే నేరస్తులకు శిక్ష పడే విధంగా చేయొచ్చు అని సూచించారు.  అంతేకాకుండా ఏ ఒక్క నేరస్థుడు తప్పించుకోకుండా చూడటం ముఖ్య ఉద్దేశమని డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టం చేశారు.