Breaking Newshome page sliderHome Page SliderNewsTelangana

జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ మళ్లీ గెలుస్తుందా?

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం దిశగా పయనిస్తోందా? అనే ప్రశ్నకు తాజా సర్వేలు ‘అవును’ అని సమాధానం చెబుతున్నాయి. పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో జూబ్లీహిల్స్ ఓటర్లు మళ్లీ గులాబీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తేలింది.

సర్వే వివరాల ప్రకారం ఈసారి కూడా బీఆర్ఎస్ గెలిస్తే, ఆ పార్టీకి ఇది వరుసగా మూడో విజయం అవుతుంది. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ విజయభేరి మోగించారు. 2014లో టిడిపి తరఫున గెలిచిన ఆయన, తరువాత బీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున రెండు సార్లు గెలుపొందారు.

రాబోయే ఉప ఎన్నికలో కూడా మాగంటి గోపీనాథ్ ప్రభావం కొనసాగుతుందా, లేక కాంగ్రెస్ మరియు బీజేపీ కొత్త వ్యూహాలతో సమీకరణాలు మారతాయా అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.