Breaking NewsHome Page SliderTelangana

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదోరోజు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై సుధీర్ఘ చర్చ కొనసాగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పెద్దలు 30శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ.. స్వయంగా కాంగ్రెస్ నేతలే మాట్లాడుకుంటున్నారంటూ అసెంబ్లీ వేదికగా కేటీఆర్ కామెంట్ చేశారు. అయితే కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్లు తీసుకుంటున్నట్టు నిరూపించాలంటూ కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కేటీఆర్ క్షమాపణ చెప్పాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ భట్టి హెచ్చరించారు. దోచుకుంది మీరు.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరే అంటూ బీఆర్‌ఎస్ నేతలపై భట్టి మండిపడ్డారు. కాగా.. కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యుల ఆందోళన నేపథ్యంలో.. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు.