వల్లభనేని వంశీకి బెయిల్..
వైసీపీ నేత వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరయ్యింది. ఏపీలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆయనతో పాటు మరో నలుగురికి బెయల్ మంజూరు చేసింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాడి చేసిన కేసులో సత్యవర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ ఆయనపై కేసు పెట్టారు. ఆయన ఫిబ్రవరిలో హైదరాబాద్లో అరెస్టయ్యారు. ఇంకా ఉంగుటూరు, గన్నవరం, హనుమాన్ జంక్షన్, పటమట పోలీస్ స్టేషన్లలో ఆయనపై 17 కేసులున్నాయి.

