టీటీడీ కీలక నిర్ణయం
తిరుమల శ్రీవారి దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దీనితో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన సమయాల్లో మార్పు చేస్తున్నామని ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి సర్వ దర్శనానికి అనుమతినివ్వనున్నారు. ఇకపై ప్రొటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని పేర్కొన్నారు. వేసవి రద్దీ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. మే 1 నుంచి జూలై 15 వరకు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. వేసవిరద్దీ కారణంగా సామాన్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని TTD ప్రకటించింది.