Home Page SliderInternationalNews AlertPolitics

విదేశీయులకు ట్రంప్ షాక్..

అమెరికాలో నివసిస్తున్న విదేశీయులపై మరో భారం పడనుంది. అధ్యక్షుడు ట్రంప్ సర్కారు కొత్తగా ఇతర దేశాలకు డబ్బు పంపడంపై 5 శాతం పన్ను విధించాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును కూడా అమెరికా హౌస్ ఆఫ్ రిపబ్లికన్స్‌లో తాజాగా ప్రవేశపెట్టారు. అంతర్జాతీయ మనీ ట్రాన్స్‌ఫర్‌పై ఈ ట్యాక్స్ వల్ల ప్రవాస భారతీయుల నెత్తిన పిడుగు పడినట్లే. ఎందుకంటే వారు పంపించే ప్రతీ లక్ష రూపాయలకు రూ. 5 వేల ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అక్కడ డబ్బు సంపాదించుకుని తమ దేశాలలోని కుటుంబాలకు పంపించే విదేశీయులకు ఆర్థికంగా తీవ్ర నష్టం కలుగుతుంది. ముఖ్యంగా భారత్‌కు ప్రస్తుతం అమెరికా నుండి ఏటా 8 వేల కోట్ల డాలర్ల వరకూ తమ కుటుంబాలకు పంపుతున్నారు. ఇప్పుడు ఈ ట్యాక్స్ విధించడం వల్ల యూఎస్‌కి బిలియన్ల కొద్దీ ఆదాయం సమకూరుతుంది. దీనిని పన్ను విరామ కాలంలో నిధులు సమకూర్చడానికి, సరిహద్దు భద్రతా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.