Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

ఏటిఎంకి నిప్పు పెట్టిన దుండ‌గులు

ఏటిఎం చోరీలు మ‌ళ్లీ వెలుగు చూస్తున్నాయి.గ‌తంలో బీహార్ కే ప‌రిమిత‌మైన ఏటిఎం దొంగ‌త‌నాలు ద‌క్షిణ భార‌త రాష్ట్రాల‌కు ఎగ‌బాకాయి.కొన్నాళ్లు పాటు స్థ‌బ్దుగా ఉన్న ఏటిఎం చోరీలు మ‌ళ్లీ జ‌డ‌లు విప్పాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కి చెందిన ఓ గ్యాంగ్ స్ట‌ర్‌..ఏకంగా ఏటిఎంకే నిప్పు పెట్టాయి.తొలుత దొంగ‌తానికి వ‌చ్చిన దుండ‌గులు ఎంత‌కీ ఏటిఎం తెరుచుకోక‌పోవ‌డంతో స‌హ‌నం కోల్పోయి కోపోద్రిక్తులై నిప్పు పెట్టారు. ఈ ఘ‌ట‌న మైలార్ దేవ‌ర‌ప‌ల్లిలో చోటు చేసుకుంది. మధుబనకాలనీ వద్ద SBI ATMలోకి చొరబడ్డ ముఠా సభ్యులు ఏటిఎంని తెరవడానికి విఫ‌ల‌య‌త్నం చేశారు.ఎంతకీ తెరుచుకోకపోవడంతో పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో మిషన్ స‌హా, 7 లక్షల కరెన్సీ నోట్లు కాలి బూడిదయ్యాయి.విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.