Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

స్టీల్ ప్లాంట్ లో మోగిన స‌మ్మె సైర‌న్‌

ప‌బ్లిక్ రంగ డొమైన్ లో …దేశంలోనే అతి పెద్దదైన‌ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. మార్చి 7వ తేదీ నుంచి సమ్మె చేపట్టనున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఈ మేరకు యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు, సకాలంలో జీతాలు చెల్లించకపోవడం లాంటి పరిణామాలతో కార్మికులు విసిగిపోయి ఉన్నారన్నారని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకున‌నారు. ఈ నేపథ్యంలో నిరవధిక సమ్మెలో పాల్గొంటామని కాంట్రాక్ట్ కార్మికులు చెబుతున్నాయి.7నుంచి ఎట్టి ప‌రిస్థితిల్లో విధులకు హాజ‌రుకామ‌ని తేల్చి చెప్పారు.కాగా ఇటీవ‌లే మోదీ ప్ర‌భుత్వం …వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి రూ.11,400కోట్ల ప్యాకేజి ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.