ఏసీబీ వలలో చిక్కిన తెలంగాణ ఎస్సీ,ఎస్టీ సెల్ జీఎం
హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లంచం తీసుకుంటూ ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్ ఏసీబీకి చిక్కారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సీ, ఎస్టీ సెల్ జీఎం ఆనంద్ కుమార్పై కేసు నమోదు చేసి ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.