Andhra PradeshBreaking Newshome page sliderHome Page SliderNewsPoliticsTrending Todayviral

ఆఫ్రికాలో నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతల ట్రైనింగ్

ఆఫ్రికా వెళ్లి నకిలీ మద్యం తయారీలో టీడీపీ నేతలు ట్రైనింగ్ తీసుకొచ్చారనీ, మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మంగళవారం మీడియా సమక్షంలో ఆరోపించారు .
మా హయాంలో కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే మద్యం పాలసీని కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలోనే నకిలీ మద్యం తయారీ ఉధృతంగా సాగుతోంది.
డబ్బు కోసం ఏ హద్దుకైనా వెళ్తున్నాడు చంద్రబాబు… ప్రజల ప్రాణాలతో,వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు అంటూ ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టడం చంద్రబాబు దురాశకు నిదర్శనం. ప్రజలకు సేవ చేసే వైద్య విద్యను కూడా వ్యాపారంగా మార్చేశాడు అని ఆయన పేర్కొన్నారు .
ఈ నెల 9వ తేదీన సీఎం వైఎస్ జగన్ నర్సీపట్నం మెడికల్ కాలేజ్‌ను సందర్శించనున్నారని తెలిపారు. “ఆ సందర్శన సందర్భంగా ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపడతాం. ప్రభుత్వంపై ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో గవర్నర్ కు చూపిస్తాం” అని పేర్ని నాని చెప్పారు. ఎక్సైజ్‌ శాఖలో అవినీతి పెరిగిపోయిందని, నకిలీ మద్యం వ్యవహారంలో సంబంధిత మంత్రికి ముడుపులు అందుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజలు ఈ అవినీతి పాలనను భరించలేరు. చంద్రబాబు ప్రభుత్వానికి అంతిమ గడియలు మోగాయి అంటూ పేర్ని నాని వ్యాఖ్యానించారు.