Breaking NewscrimeHome Page SliderNational

అత్యాచార‌ కేసులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

సుదీర్ఘ కాలం పాటు ఓ వ్యక్తితో సహజీవనం చేసి ఆ తర్వాత తనను పెళ్లి పేరుతో మోసం చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడంటూ మహిళలు పెట్టే అత్యాచారం కేసులు చెల్లవంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.అలాంటి సందర్భాలలో పెళ్లి చేసుకుంటాననే హామీతో మాత్రమే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడిందని కచ్చితంగా నిర్ధారించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. లివ్-ఇన్ పార్టనర్ అత్యాచారం చేశాడని ఆరోపించిన బ్యాంకు అధికారిపై క్రిమినల్ చర్యలను రద్దు చేస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకుంటానని చెప్పడంతోనే అతనితో 16 సంవత్సరాలుగా శారీరక సంబంధం పెట్టుకున్నానని ఆరోపించిన మహిళా లెక్చరర్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు తోసిపుచ్చారు. దాదాపు 16 ఏళ్లుగా క‌లిసి ఉన్న‌ప్పుడు.. ఇద్దరి పరస్పద అంగీకరంగాతోనే వారి మధ్య శారీరక సంబంధం ఏర్పడి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని భావించినప్పటికీ, కేవలం పెళ్లి చేసుకుంటాడనే నమ్మకంతోనే ఇన్నేళ్లు ఆమె, అతనితో శారీరక సంబంధం పెట్టుకుందని భావించడం సరికాదని కోర్టు పేర్కొంది. బంధం ఎక్కువ కాలం కొనసాగినప్పుడు అటువంటి వాదనలు విశ్వసనీయతను కోల్పోతాయని కోర్టు వెల్లడించింది.