తండ్రి మృతదేహం ఎదుట వివాహం చేసుకున్న కుమారుడు
తండ్రి మృతదేహం ఎదుట కుమారుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరు జిల్లాలో చోటు చేసుకుంది. తండ్రి కవణ్ణైలో సెల్వరాజ్ రైల్వే ఉద్యోగి. లా కళాశాలలో చదువుతున్న ఆయన రెండో కుమారుడు అప్పు, విరుధాచలం కౌంజియప్పర్ ప్రభుత్వ డీగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిణి విజయశాంతితో గత మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలతో అనుమతితో వివాహం చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అప్పు తండ్రి సెల్వరాజ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి చనిపోయారు. అంతిమయాత్రకు ముందే ఆశీస్సులు పొందాలనే ఉద్దేశ్యంతో ప్రియురాలిని ఒప్పించి తండ్రి మృత దేహం ఎదుట ఆమెకు అప్పు తాళి కట్టారు. పుట్టెడు దుఃఖంలోను అప్పు తల్లి, బంధువులు, గ్రామస్థులు వారిని ఆశీర్వదించారు. అయితే.. అమ్మాయి తరఫువారు పాల్గొనలేదు.


 
							 
							